వరుస దొంగతనాలు దోపిడీలు చేసే ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- January 17, 2017
రియాద్: రాజధానిలో వరుస దొంగతనాలకు మరియు దోపిడీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గల ఐదుగురు సభ్యులు గల ఒక ముఠాను గత వారం పోలీసులు అరెస్టు చేశారు. రియాద్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగల ముఠా పలు విలువైన వస్తువులతో కలిపి1.5 మిలియన్ సౌదీ రియాళ్ళ నగదుని దోచుకొన్నారని పేర్కొన్నారు.ఈ ముఠాలో నల్గురు సౌదీలు మరియు ఒక సుడాన్ జాతీయుడు ఉన్నారు. వీరు ఇళ్లల్లో మరియు నిలిపిన వాహనాల నుండి విలువైన వస్తువులను అపహరిస్తామని అంగీకరించారు. ఒక ఇంటిలో దొంగతనం చేసి తిరిగివస్తున్న సందర్భంలో పోలీసులు
సుడానీ, సౌదీ జాతీయులను పట్టుకొన్నారు. మరో సంఘటనలో వ్యాపారస్తులు దుకాణాలు మూసివేసిన తర్వాత దోపిడీలు జరిపే దొంగలను పట్టుకొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏ శబ్దం లేకుండా గోడలకు కన్నాలు వేయడం, ఎటువంటి శబ్దాలు లేకుండా గాజు కిటికీలు విచ్ఛిన్నం చేయడంలో బాగా ఆరితేరారని తెలిపారు.ఎంతో నిశబ్ధంగా దొంగిలించిన వస్తువులని అక్కడ్నించి తరలిస్తారని చెప్పారు. ముఠాలో ఉన్న మిగిలిన అనుమానితులను కనుగొనడానికి, దొంగిలించిన సొత్తుని కనుగొనడానికి ఇంకా కొన్ని పరిశోధనలు నిర్వహిస్తున్నామని పోలీసులు వివరించారు. పరిశోధనలు పూర్తయ్యాక అనుమానితుల వివరాలను కోర్టు ముందు ప్రవేశపెడతామని పోలీసులు అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







