జన నేతకి కొత్త బాధ్యత

- January 17, 2017 , by Maagulf
జన నేతకి కొత్త బాధ్యత

మొన్న మెగా ఫుడ్‌పార్క్... నిన్న ఉద్దానం... ఇప్పుడు నేతన్నల సమస్య. ఒకొక్కరుగా తమ సమస్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు విన్నవించుకుంటున్నారు. పవన్‌తో చెప్పుకుంటే తమకు కొంతలోకొంతైనా బాధ తగ్గుతుందని భావించి.. తెలంగాణ చేనేత అఖిలపక్షం ఐక్య వేదిక- ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యులు ఉమ్మడిగా హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్‌ని కలిశారు.
తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా మంగళగిరి లో చేపట్టనున్న 'చేనేత సత్యాగ్రహం' కార్యక్రమానికి రావాలని పవన్‌ని ఆహ్వానించడం, అందుకు పవన్ ఓకే చెప్పడం జరిగిపోయింది. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, సమస్యలను ఇటు రాష్ర్టం, అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు పవన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com