జన నేతకి కొత్త బాధ్యత
- January 17, 2017
మొన్న మెగా ఫుడ్పార్క్... నిన్న ఉద్దానం... ఇప్పుడు నేతన్నల సమస్య. ఒకొక్కరుగా తమ సమస్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు విన్నవించుకుంటున్నారు. పవన్తో చెప్పుకుంటే తమకు కొంతలోకొంతైనా బాధ తగ్గుతుందని భావించి.. తెలంగాణ చేనేత అఖిలపక్షం ఐక్య వేదిక- ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యులు ఉమ్మడిగా హైదరాబాద్లోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ని కలిశారు.
తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా మంగళగిరి లో చేపట్టనున్న 'చేనేత సత్యాగ్రహం' కార్యక్రమానికి రావాలని పవన్ని ఆహ్వానించడం, అందుకు పవన్ ఓకే చెప్పడం జరిగిపోయింది. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, సమస్యలను ఇటు రాష్ర్టం, అటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు పవన్.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







