పడవ మునక మధ్యధరాలో...
- January 18, 2017
- 180 మంది గల్లంతు
రోమ్ : మధ్యధరా సముద్రంలో శనివారం రాత్రి సంభవించిన వలస ప్రయాణీకుల పడవ మునిగిన ప్రమాదంలో నలుగురు మరణించారని, మరో 180 మందికి పైగా గల్లంతయ్యారని ఐరాస అంతర్జాతీయ వలస వ్యవహారాల సంస్థ (ఐఓఎం) వెల్లడించింది. ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి ఇటలీ రేవుపట్టణం త్రపానీకి చేరుకున్న నలుగురు ప్రయాణికుల ద్వారా ఈ సమాచారం తెలిసిందని ఐరాస వివరించింది. గల్లంతయిన వారంతా మరణించినట్లు భావిస్తున్నామని వారు అధికారులకు వివరించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు ఎరిత్రియన్లు, ఇద్దరు ఇథియోపియన్లు వున్నారని వీరు సోమవారం సాయంత్రం త్రపాని తీరానికి చేరుకున్నారని ఐఓఎం ప్రతినిదులు వివరించారు.
శుక్రవారం సాయంత్రం లిబియా తీరం నుండి కిక్కిరిసిన ప్రయాణికులతో ఈ చెక్కపడవ బయల్దేరిందని, వీరంతా తూర్పు ఆఫ్రికా ప్రాంతానికిచెందిన వారేనని తెలుస్తోంది. ప్రయాణం ప్రారంభించిన ఐదు గంటల తరువాత పడవ ఇంజన్ చెడిపోయి నెమ్మదిగా నీరు ప్రవేశించడం ప్రారంభించిందని, పడవ నెమ్మదిగా మునిగిపోవడంతో జలసమాధి అయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని ఐఓఎం ప్రతినిదులు చెప్పారు. మునిగిపోయిన వారు కొన్ని గంటలపాటు నీటిలో వుండిపోయారని, శనివారం నాడు లిబియా తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఫ్రాన్స్కు చెందిన ఒక బోటు వారిని రక్షించి మరో నౌకలోకి మార్చిందని వివరించారు. నార్వేజియన్ కోస్ట్గార్డ్కు చెందిన ఈ నౌక సోమవారం సాయంత్రం నలుగురు సజీవులతో త్రపానీకి చేరుకుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!







