కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఎయిర్ ఏషియా.!
- January 18, 2017
విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశ రాజధాని దిల్లీ నుంచి రెండు కొత్త సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు 2017 ఫిబ్రవరి 19నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి అమర్ అబ్రోల్ తెలిపారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ... దిల్లీ - శ్రీనగర్, దిల్లీ - బాగ్డోగ్రాకి మధ్య ఈ నూతన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే దిల్లీ - పుణె మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.
2016లో సంస్థకు మంచి లాభాలు వచ్చాయని, 2017లోనూ అదే దిశగా తాము ప్రయత్నాలు జరుపుతున్నామని. ఇందులో భాగంగానే ఈ నూతన సర్వీసులను ప్రారంభించినట్లు అమర్ వెల్లడించారు. దిల్లీ, బెంగళూరు నుంచి ప్రయాణికులను తమ సంస్థ 13 గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలపై ఆఫర్లు ప్రకటించింది. దిల్లీ - శ్రీనగర్ మధ్య టికెట్ ధర రూ.1,999 ఉండగా, దిల్లీ - బాగ్డోగ్రాకి రూ.2,499, దిల్లీ- పుణెకి రూ.2,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!







