కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఎయిర్ ఏషియా.!
- January 18, 2017
విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా దేశ రాజధాని దిల్లీ నుంచి రెండు కొత్త సర్వీసులు ప్రారంభించింది. ఈ సర్వీసులు 2017 ఫిబ్రవరి 19నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి అమర్ అబ్రోల్ తెలిపారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ... దిల్లీ - శ్రీనగర్, దిల్లీ - బాగ్డోగ్రాకి మధ్య ఈ నూతన సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. అలాగే దిల్లీ - పుణె మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు.
2016లో సంస్థకు మంచి లాభాలు వచ్చాయని, 2017లోనూ అదే దిశగా తాము ప్రయత్నాలు జరుపుతున్నామని. ఇందులో భాగంగానే ఈ నూతన సర్వీసులను ప్రారంభించినట్లు అమర్ వెల్లడించారు. దిల్లీ, బెంగళూరు నుంచి ప్రయాణికులను తమ సంస్థ 13 గమ్యస్థానాలకు చేర్చుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలపై ఆఫర్లు ప్రకటించింది. దిల్లీ - శ్రీనగర్ మధ్య టికెట్ ధర రూ.1,999 ఉండగా, దిల్లీ - బాగ్డోగ్రాకి రూ.2,499, దిల్లీ- పుణెకి రూ.2,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







