ఆర్మీ యూనిఫాంలో తిరుగుతున్న ఉగ్రవాదులు
- January 18, 2017
దాదాపు ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో కనిపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో దిల్లీలోని విమానాశ్రయం, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు కెప్టెన్, సుబేదార్ ర్యాంకుల్లోని యూనిఫాంలలో ఉన్నట్లు భావిస్తున్నారు. పంజాబ్లోని చక్రి, గురుదాస్పూర్ సరిహద్దు పోస్ట్ల వద్ద అనుమానిత ఉగ్రవాదులు కనిపించినట్లు అమృత్సర్కు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. వీరు సరిహద్దు నుంచి భారత్లోకి చొరబడిన తర్వాత ఆర్మీ దుస్తులు ధరించి ఉంటారని అనుమానిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో, మెట్రో స్టేషన్లలో మరింతగా భద్రతను పెంచినట్లు సీఐఎస్ఎఫ్ అధికారి వెల్లడించారు. భద్రత పెంపుతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు కాస్త ఇబ్బందిపడ్డారు. ఒకటికి రెండు సార్లు స్క్రీనింగ్లు, ప్రవేశ ద్వారం వద్ద, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద బ్యాగులు చెక్ చేయడంతో క్యూ లైన్లు పెరిగిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







