భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో వన్డే...

- January 18, 2017 , by Maagulf
భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో వన్డే...

హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో నేడు భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే విజయంతో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని ఉంది. ఒత్తిడి మీదున్న మోర్గాన్ సేన కూడా ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. ఏది ఏమైనప్పటికి జోరు మీద ఉన్న టీమిండియాకు.....ఒత్తిడిలో ఉన్న మోర్గాన్‌సేనకు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com