సీబీఐ చీఫ్‌గా ఢిల్లీ​ పోలీస్‌ చీఫ్‌ అలోక్‌ కుమార్‌ వర్మ

- January 19, 2017 , by Maagulf
సీబీఐ చీఫ్‌గా ఢిల్లీ​ పోలీస్‌ చీఫ్‌ అలోక్‌ కుమార్‌ వర్మ

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చీఫ్‌గా ఢిల్లీ​ పోలీస్‌ చీఫ్‌ అలోక్‌కుమార్‌వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 1979 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వర్మ అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా, మిజోరాం ప్రాంతాల్లో పనిచేశారు. తిహార్‌ జైలు డీజీగా కూడా ఆయన పనిచేశారు.

డిసెంబరు 2న అనిల్‌ సిన్హా పదవీ విరమణ చేయడంతోఅప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ ఆస్థానా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్‌ రేసులో 45 మంది ఐపీఎస్‌ అధికారుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరిలో కృష్ణ చౌదరి, అరుణా బహుగుణ, ఎస్‌.సి, మాధుర్‌ పేర్లు బాగా ప్రచారంలోకి వినిపించాయి. సీబీఐ డైరెక్టర్‌ ఎంపికపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినప్పటికీ, నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com