సీబీఐ చీఫ్గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ వర్మ
- January 19, 2017
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చీఫ్గా ఢిల్లీ పోలీస్ చీఫ్ అలోక్కుమార్వర్మ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వర్మ అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ప్రాంతాల్లో పనిచేశారు. తిహార్ జైలు డీజీగా కూడా ఆయన పనిచేశారు.
డిసెంబరు 2న అనిల్ సిన్హా పదవీ విరమణ చేయడంతోఅప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ ఆస్థానా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ రేసులో 45 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వీరిలో కృష్ణ చౌదరి, అరుణా బహుగుణ, ఎస్.సి, మాధుర్ పేర్లు బాగా ప్రచారంలోకి వినిపించాయి. సీబీఐ డైరెక్టర్ ఎంపికపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినప్పటికీ, నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







