గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ హెచ్చరిక

- January 20, 2017 , by Maagulf
గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హిజ్బుల్‌ ముజాహిదీన్‌ సంస్థ హెచ్చరిక

ప్రజలెవరూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తూ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. 10 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో గుర్తుతెలియని ముజాహిదీన్‌ కమాండర్‌ రెండు ఏకే-47 తుపాకులు పట్టుకొని మాట్లాడాడు. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయనాయకులు ఎటువంటి భద్రత లేకుండా 15 నిమిషాల పాటు ఇల్లు లేదా స్వస్థలాల్లో ఉండండంటూ సవాలు విసిరారు. మొసలి కన్నీళ్లు కార్చడం ఆపండి అంటూ హెచ్చరించారు. దేశమంతా మీ వెంట ఉందని మీరు భావిస్తే భద్రత లేకుండా పదిహేను నిమిషాలు ఉండండి.

అప్పుడు తెలుస్తుంది దేశం మిలిటెంట్ల వైపు ఉందనే విషయం.. అని అన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీని గతేడాది భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో జమ్ముకశ్మీర్‌ అంతా అల్లర్లు చెలరేగాయి. దాదాపు ఐదు నెలల పాటు సాగిన ఈ ఘర్షణల్లో పలువురు సాధారణ పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com