గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ హెచ్చరిక
- January 20, 2017
ప్రజలెవరూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనకూడదని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. 10 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో గుర్తుతెలియని ముజాహిదీన్ కమాండర్ రెండు ఏకే-47 తుపాకులు పట్టుకొని మాట్లాడాడు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయనాయకులు ఎటువంటి భద్రత లేకుండా 15 నిమిషాల పాటు ఇల్లు లేదా స్వస్థలాల్లో ఉండండంటూ సవాలు విసిరారు. మొసలి కన్నీళ్లు కార్చడం ఆపండి అంటూ హెచ్చరించారు. దేశమంతా మీ వెంట ఉందని మీరు భావిస్తే భద్రత లేకుండా పదిహేను నిమిషాలు ఉండండి.
అప్పుడు తెలుస్తుంది దేశం మిలిటెంట్ల వైపు ఉందనే విషయం.. అని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని గతేడాది భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో జమ్ముకశ్మీర్ అంతా అల్లర్లు చెలరేగాయి. దాదాపు ఐదు నెలల పాటు సాగిన ఈ ఘర్షణల్లో పలువురు సాధారణ పౌరులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







