జల్లికట్టు కి ఓకే చెప్పిన కేంద్రం.!
- January 20, 2017
తమిళులు పోరాటం ఫలించింది. జల్లికట్టు కు కేంద్రం జై కొట్టింది. తమిళులు ఉద్యమానికి కేంద్రం తలోగ్గింది. తమిళనాడు సర్కార్ పంపిన ఆర్డినెన్స్కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మెరీనా బీచ్ వద్ద వేలాది మంది తమిళులు సంబరాలు జరుపుకుంటున్నారు. జల్లికట్టు లక్ష్యంగా తమిళులు ఏ పార్టీకి సంబంధం లేకుండా యవతరమే స్వచ్ఛందంగా ముందుకు కదిలింది. వీరికి అన్ని తమిళ వర్గాలు మద్దతు పలుకాయి. దాంతో ఉద్యమం తాడోపెడో అనే స్థాయికి చేరింది. ద్రవిడ సంస్కృతిలో జలకట్టుకు వేల ఏళ్ల చరిత్రి ఉంది. దాదాపు 3500 ఏళ్ల కిందట తమిళనాడులో జల్లికట్టు జరిగిందనడానికి ఆధారాలు లభ్యమయ్యాయి. నీలగిరి జిల్లాలో కరిక్యూర్ అనే గ్రామం వద్ద తవ్వకాల్లో లభ్యమైన శిలాపలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు ఉన్నాయి.
ఇవి 3500 ఏళ్ల నాటివి అని ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అలాంటి జల్లికట్టును ఇప్పుడు నిషేధిత క్రీడగా ప్రకటించడంపై తమిళ సమాజం మండిపడుతోంది. ప్రతి ఒక్కరిలోను తమ సంస్కృతి, సంప్రదాయాలను తమకు కాకుండా చేస్తున్నారనే భావన తమిళుల్లో పెరిగిపోయింది. ఫలితంగా జల్లికట్టను కాపాడుకోవాలనే భావనలో యువతరం ఉంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







