మరోసారి అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్‌ బ్రాండ్‌గా ఫ్లిప్‌కార్ట్‌

- January 20, 2017 , by Maagulf
మరోసారి అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్‌ బ్రాండ్‌గా ఫ్లిప్‌కార్ట్‌

ఎలక్ట్రానిక్‌ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారత్‌లో అత్యంత విశ్వసనీయ ఇ-కామర్స్‌ బ్రాండ్‌గా అగ్రస్థానం సంపాదించింది. 'ది ఇండియన్‌ ఇ-టెయిలింగ్‌ లీడర్‌షిప్‌ ఇండెక్స్‌' పేరుతో దేశవ్యాప్తంగా వినియోగదారులపై పరిశోధనా సంస్థ రెడ్‌ సీర్‌ కన్సల్టింగ్‌ ఒక సర్వే నిర్వహించింది. ఉత్పత్తుల ఎంపిక, వినియోగదారుల మద్దతు, రిఫండ్‌, తిరిగి డెలివరీలను స్వాధీనం చేసుకొనే వేగంతో పాటు పలు అంశాల్లో మిగతా ఇ-కామర్స్‌ సంస్థలను వెనక్కి నెట్టి ఫ్లిప్‌కార్ట్‌కే ఎక్కువ స్కోరు వచ్చిందని నివేదికలో వెల్లడించింది. దీంతో వరుసగా నాలుగోసారి విశ్వసనీయ బ్రాండ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ తన స్థానాన్ని మరోసారి నిలుపుకొంది. భారత్‌లోని 30 నగరాల్లో 7500 మంది వినియోగదారులపై సర్వే నిర్వహించి నివేదికను తయారు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com