అధ్యక్ష పీఠాన్ని వీడిన 'జామే'...

- January 22, 2017 , by Maagulf
అధ్యక్ష పీఠాన్ని వీడిన 'జామే'...

- ఫలించిన పశ్చిమ ఆఫ్రికా దేశాధినేతల మధ్యవర్తిత్వం 
బాంజుల్‌ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాను 22 ఏండ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన యహ్యా జామే ఎట్టకేలకు అధ్యక్ష పీఠాన్ని వీడారు. గతనెల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అదామా బారో గురువారం ప్రమాణం చేశారు. అయితే, అధ్యక్ష పీఠాన్ని వదిలిపెట్టేందుకు జామే నిరాకరించడంతో గాంబియాలో అల్లర్లు మిన్నంటాయి. ఐరాస భద్రతా మండలికి చెందిన 15 సభ్య దేశాలు ఘర్షణలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. గాంబియా నూతన అధ్యక్షుడికి బాసటగా నిలిచాయి. అంతేగాకుండా, బారోకు ఎకోవస్‌ ( ఎకనామిక్‌ కమ్యూనిటీ ఆఫ్‌ వెస్ట్‌ ఆఫ్రికన్‌ స్టేట్స్‌ ) కూడా మద్దతు ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com