నేడు ఢిల్లీకి సీఎం...

- January 22, 2017 , by Maagulf
నేడు ఢిల్లీకి సీఎం...

అమరావతి : సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను సీఎం కలవనున్నారు. ఇటీవల జస్టిస్‌ రమణ తల్లి మరణించిన నేపథ్యంలో ఆయనను పరామర్శించనున్నారు. సోమవారం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలవనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించవలసిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు జైట్లీని ఆహ్వానించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com