సీఎం కేసీఆర్ 30న తిరుమలకు...
- January 22, 2017
హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమల వేంకటేశ్వరస్వామిని, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తానని మొక్కుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వాటిని తీర్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు ఈనెల 30వ తేదీన ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆరోజు ఉదయం ఆయన నేరుగా తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుని, తాను మొక్కుకున్నట్టుగా బంగారు సాలిగ్రామ హారం, ఐదు పేటల కంటె సమర్పించుకుంటారు. అక్కణ్నుంచీ బయల్దేరి విజయవాడకు చేరుకుని కనక దుర్గమ్మ దర్శనం చేసుకుని, బంగారు ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం హారం, కంటె, ముక్కు పుడక సిద్ధం చేసింది. అనంతరం ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఆతిథ్యమిస్తారు. ఈ సందర్భంగా వారు పలు అంశాల మీద చర్చలు జరిపే అవకాశం ఉంది. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కానుకలు చెల్లిస్తానని మొక్కుకున్న కేసీఆర్.. ఇప్పటికే తెలంగాణలోని దేవుళ్లు, దేవతలకు మొక్కలు చెల్లించుకున్న విషయం తెలిసిందే. కురవి వీరభద్రస్వామి, కొమురెల్లి మల్లన్న, యాదాద్రి నరసింహస్వామి, వరంగల్ భద్రకాళికి ఇప్పటికే మొక్కులు చెల్లించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







