కువైట్ నుంచి పక్షుల దిగుమతిపై బహ్రెయిన్ నిషేదం..
- January 24, 2017
బర్డ్ ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ నుంచి వచ్చే వివిధ రకాలైన పక్షులను దిగుమతి చేసుకోవడంపై బ్యాన్ విధించింది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ - అగ్రికల్చరల్ ఎఫైర్స్ మరియు మెరైన్ రీసోర్సెస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అన్ని ఎంట్రీ పాయింట్స్ వద్దా స్టేట్ ఆఫ్ ఎమర్జన్సీని విధించారు. దేశంలోని అన్ని ఫామ్స్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్లలో తనిఖీలు నిర్వహించడానికి ఆదేశాలు చేశామని అగ్రికల్చర్ మరియు మెరైన్ రిసోర్సెస్ అండర్ సెక్రెటరీ షేక్ ఖలీఫా బిన్ ఇసా అల్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్ బర్డ్ ఫ్లూ నుంచి పూర్తి క్షేమంగా ఉందని, పక్షుల పెంపకందార్లకు ఏమైనా అనుమనాలు కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కువైట్లో బర్డ్ ఫ్లూ కారణంగా 285 పక్షులు మృతి చెందినట్లు ఓఐఇ - వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







