చీప్‌గా ఇసుక అమ్మకం: బహ్రెయిన్‌ మేనేజర్‌పై కేసు..

- January 24, 2017 , by Maagulf
చీప్‌గా ఇసుక అమ్మకం: బహ్రెయిన్‌ మేనేజర్‌పై కేసు..

మెరైన్‌ డ్రెడ్జింగ్‌ కంపెనీ, తమ మేనేజర్‌ మార్కెట్‌ రేటుకన్నా తక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. వేరే కంపెనీలకు తక్కువ ధరకు ఇసుక అమ్మడం, తద్వారా ఆ కంపెనీలకు లాభం చేకూర్చే కుట్ర ఇందులో దాగి ఉందని ఆ కంపెనీ ఆరోపించింది. యాంటీ కర్ప్షన్‌ మరియు ఎకనమిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ జనరల్‌ డైరెక్టర్‌ ఈ విషయంపై స్పందిస్తూ, కేసు విచారణలో ఉందని అన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ద్వారా సదరు వ్యక్తిపై వారెంట్‌ జారీ చేసినట్లు తెలిపారాయన. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుని రిఫర్‌ చేశామని చెప్పారాయన. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com