గాంధీ మెమోరియల్ని సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- January 26, 2017
అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ డిప్యూటీ సూప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ లైద్, మహాత్మాగాంధీ మెమోరియల్ని సందర్శించారు. భారతదేశంలో అధికారిక పర్యటన సందర్భంగా ఢిల్లీలోని మహాత్మాగాంధీ మెమోరియల్ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా రాజ్ ఘాట్ మెమోరియల్లో ఒక నిమిషం పాటు ఆయన మౌనం పాటించి, మహాత్ముడికి నివాళులర్పించారు. మహనీయులు ప్రజల గుండెల్లో, ఆయా దేశాల చరిత్రల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్, గెస్ట్ బుక్లో పేర్కొన్నారు. ఫౌండర్ ఫాదర్ షేక్ జాయెద్, 1975లో భారతదేశ పర్యటన సందర్భంగా భారతదేశంతో ఏర్పరచిన సంబంధాల్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నట్లు తెలిపారాయన. 1975లో పాతిన చెట్టుకి నీళ్ళు పోసి, ఇప్పుడు కొత్తగా మరో మొక్కని అక్కడ నాటడం జరిగింది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు నాటిన మొక్కలున్నాయిక్కడ.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







