కృతజ్ఞతలు యూఏఈకి...

- January 26, 2017 , by Maagulf
కృతజ్ఞతలు యూఏఈకి...

భారతీయులను ప్రోత్సహించిన అరబ్‌ దేశాలు: ప్రణబ్‌
న్యూఢిల్లీ, జనవరి 26: ఉపాధి కోసం వలస వెళ్లిన లక్షలాది మంది భారతీయులను గుండెకు హత్తుకొని ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు ప్రోత్సహించిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు. అబుదాబి యువరాజు, యూఏఈ సైనిక డిప్యూటి సుప్రీం కమాండర్‌ షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. యూఏఈలో స్థిరపడిన 26 లక్షల మంది భారతీయులకు మున్ముందూ ఇలాంటి ప్రోత్సాహమే లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com