దిర్హామ్కి ముందు యూఏఈలో రూపాయి చెలామణీ
- January 27, 2017
ఇప్పుడు చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, యూఏఈలో దిర్హామ్ అనేది రాకముందు, కరెన్సీగా గల్ఫ్ రుపాయిని వినియోగించేవారు. ఇది చమురు కథకి ముందు విషయమని నుమిస్బింగ్ ఫౌండర్ రామ్కుమార్ చెప్పారు. దిర్హామ్ పుట్టుకకి ముందు పలు రకాలైన కరెన్సీలను వినియోగించేవాళ్ళని ఆయన వివరించారు. బ్రిటిష్తో ఒప్పందాల కాలంలో ట్రుసియల్ స్టేట్స్, తమకు దగ్గరలో ఉన్న పెద్ద దేశాల కరెన్సీని వినియోగించేవారు. బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా తదితర దేశాలకు చెందిన కరెన్సీని అప్పట్లో వినియోగించేవారు. ట్రుసియల్ స్టేట్స్లో 1957 వరకు ఇండియన్ కరెన్సీని వాడేవారు. 1957లో ఎక్సటర్నల్ రుపీస్ లేదా గల్ఫ్ రుపీస్ పేరుతో కొత్త నోట్లు ఇండియాలో ప్రింట్ అయ్యాయి. ఇవి గల్ఫ్ దేశాల్లో వినియోగం కోసం ప్రింట్ చేసేవారు. డిజైన్ ఒకేలా ఉన్నా, కలర్ మార్పుతో వీటిని రూపొందించేవారు. ఇండియాతో వాడే నోట్లతో వేరుగా ఉండేందుకుగాను జెడ్ అనే అక్షరాన్ని వీటి కోసం వినియోగించేవారు. 1, 10, 100 రూపాయల డినామినేషన్లో వీటిని వినియోగించేవారని రామ్కుమార్ చెప్పారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ వంటి దేశాలు కూడా వీటిని చెలామణీ చేసేవి. 1957 నుంచి 1966 వరకు గల్ఫ్ రుపీస్ సర్క్యులేషన్లో ఉండేవి. 1966 నుంచి 1973 వరకు ట్రుసియల్ స్టేట్స్ ఖతార్ దుబాయ్ రియాల్ని వినియోగంలోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









