భారత్‌లో బంగ్లా పర్యటన ఖరారు...

- January 27, 2017 , by Maagulf
భారత్‌లో బంగ్లా పర్యటన ఖరారు...

భారత్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన ఖరారైంది. టీమ్‌ఇండియాతో ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్‌ హైదరాబాద్‌ చేరుకుంటుంది. 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇండియా-ఎతో బంగ్లాదేశ్‌ తలపడుతుంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్‌ స్టేడియంలో టెస్టు మ్యాచ్‌ జరుగుతుంది. 14న బంగ్లాదేశ్‌ స్వదేశానికి బయల్దేరుతుంది. ఫిబ్రవరి 23న టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభమవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com