ఇరాక్‌లో చేతులెత్తేసిన మన విదేశాంగ శాఖ...

- January 28, 2017 , by Maagulf
ఇరాక్‌లో చేతులెత్తేసిన మన విదేశాంగ శాఖ...

వీసా లేనివారిని జరిమానా చెల్లించకుండా పంపించలేమంటున్న ఎంబసీ అధికారులు 

మోర్తాడ్‌: ఇరాక్‌లో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణవాసులను ఇళ్లకు రప్పించడానికి చర్యలు తీసు కుంటామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రకటనకు భిన్నంగా ఇరాక్‌లోని మన ఎంబసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. వీసా గడువు ముగిసినా ఇరాక్‌లో ఉండిపోయినవారు సొంత దేశా లకు వెళ్లాలంటే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాక్‌లో ఉపాధి కోసం ఒక్కో కార్మికుడు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసి వీసా పొందారు. ఇరాక్‌లో వర్క్‌ వీసా అని చెప్పి విజిట్‌ వీసా ఇచ్చిన ఏజెంట్లు తెలంగాణ కార్మికులను వం చించిన విషయం విదితమే.
ఇరాక్‌లో వర్క్‌ పర్మిట్, వీసా లేకుండా ఉన్నవారు రెండువేల డాలర్ల జరి మానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇంటికి రావడానికి విమాన చార్జీల కోసం మరో 600 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు భరించాలి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకు పోయిన తాము ఏజెంట్ల మూలంగా ఇరాక్‌లో పనిలేక పస్తులుంటున్నామని మళ్లీ ఇంటికి రావడానికి డబ్బులు చెల్లించాలనడం సమంజసంగా లేదని కార్మి కులు అంటున్నారు. ఇరాక్‌లో 500 మంది తెలం గాణవాసులు చట్ట విరుద్ధంగా ఉన్నారు. ఇందులో 33 మంది గల్ఫ్‌ తెలంగాణ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి, ఇరాక్‌లో ఒక కంపెనీలో పని చేస్తున్న జన్నారంవాసి మాటేటి కుమార్‌ల చొరవతో జరిమానా చెల్లించకుండానే ఇంటికి చేరుకున్నారు. మిగిలినవారు ఇరాక్‌లో ఉండిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com