టెక్సాస్‌లో ప్రార్ధనా స్థలానికి నిప్పు!...

- January 28, 2017 , by Maagulf
టెక్సాస్‌లో ప్రార్ధనా స్థలానికి నిప్పు!...

టెక్సాస్‌, జనవరి 28: ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే టెక్సాస్‌లోని ఓ ఇస్లాం ప్రార్ధనా స్థలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుబెట్టారు. శనివారం తెల్లవారుజామున విక్టోరియాలోని ఈ ప్రార్ధనా స్థలం మంటల్లో కాలిబూడిదైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇక్కడ ముస్లిం, ఇస్లామిక్‌ సంస్థలపై దాడులు పెరిగాయి. ఇటీవలే ఈ ప్రార్ధనా సం్థలంలో దొంగలు పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ముస్లింలపై నిషేధ నిర్ణయం వెల్లడించిన కొన్ని గంటల్లోనే భారీ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం వెనుక కారణాలు ఇప్పటికిప్పుడు తెలియకున్నా.. ఎవరో కావాలనే నిప్పుబెట్టి ఉంటారని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com