టెక్సాస్లో ప్రార్ధనా స్థలానికి నిప్పు!...
- January 28, 2017
టెక్సాస్, జనవరి 28: ముస్లిం మెజార్టీ దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే టెక్సాస్లోని ఓ ఇస్లాం ప్రార్ధనా స్థలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుబెట్టారు. శనివారం తెల్లవారుజామున విక్టోరియాలోని ఈ ప్రార్ధనా స్థలం మంటల్లో కాలిబూడిదైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇక్కడ ముస్లిం, ఇస్లామిక్ సంస్థలపై దాడులు పెరిగాయి. ఇటీవలే ఈ ప్రార్ధనా సం్థలంలో దొంగలు పడ్డారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ముస్లింలపై నిషేధ నిర్ణయం వెల్లడించిన కొన్ని గంటల్లోనే భారీ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం వెనుక కారణాలు ఇప్పటికిప్పుడు తెలియకున్నా.. ఎవరో కావాలనే నిప్పుబెట్టి ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







