కలకలం రేపిన ఐఎస్ పోస్టర్..
- January 31, 2017
ఆర్మీ కంటోన్మెంట్కు సమీపంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గోడపత్రిక ప్రత్యక్షమవడం కలకలం రేపింది. హిమాచల్ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో సుబథు ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో ఐఎస్ జెండా, గోడపత్రికలను స్థానికులు గమనించారు. హిందీ, ఉర్దూ, ఆంగ్లం భాషలలో పోస్టరు, పతాకాలపై 'త్వరలో ఐఎస్ఐఎస్ రాబోతుంది' అనే నినాదం రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిమ్లాకు కేవలం 50 కి.మీ. దూరంలో సుబథు సైనిక స్థావరం ఉంది. సుబథు నుంచి నేపాల్ వరకు మూడు చోట్ల బాంబు దాడులు చేయనున్నట్లు పోస్టర్లలో ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నామని, స్థానికులను ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని సూచించామని తెలిపారు.
ఇంతకుముందు సోలాన్లోని ఓ ఆలయం గోడలపై అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో ఇదే రకమైన వ్యాఖ్యలు రాశారని వివరించారు.
డిసెంబరులోనే..
గత డిసెంబరులో బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోస్టర్లకు బాధ్యుడిగా అనుమానిస్తున్న అబీద్ ఖాన్ను చర్చి వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడు కొన్ని నెలలుగా నకిలీ గుర్తింపు కార్డులతో నివాసముంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







