కలకలం రేపిన ఐఎస్ పోస్టర్..
- January 31, 2017
ఆర్మీ కంటోన్మెంట్కు సమీపంలో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) గోడపత్రిక ప్రత్యక్షమవడం కలకలం రేపింది. హిమాచల్ప్రదేశ్లోని సోలాన్ జిల్లాలో సుబథు ఆర్మీ కంటోన్మెంట్ సమీపంలో ఐఎస్ జెండా, గోడపత్రికలను స్థానికులు గమనించారు. హిందీ, ఉర్దూ, ఆంగ్లం భాషలలో పోస్టరు, పతాకాలపై 'త్వరలో ఐఎస్ఐఎస్ రాబోతుంది' అనే నినాదం రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిమ్లాకు కేవలం 50 కి.మీ. దూరంలో సుబథు సైనిక స్థావరం ఉంది. సుబథు నుంచి నేపాల్ వరకు మూడు చోట్ల బాంబు దాడులు చేయనున్నట్లు పోస్టర్లలో ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నామని, స్థానికులను ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని సూచించామని తెలిపారు.
ఇంతకుముందు సోలాన్లోని ఓ ఆలయం గోడలపై అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో ఇదే రకమైన వ్యాఖ్యలు రాశారని వివరించారు.
డిసెంబరులోనే..
గత డిసెంబరులో బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోస్టర్లకు బాధ్యుడిగా అనుమానిస్తున్న అబీద్ ఖాన్ను చర్చి వద్ద అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడు కొన్ని నెలలుగా నకిలీ గుర్తింపు కార్డులతో నివాసముంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







