కొత్త సంప్రదాయానికి నాంది : ప్రధాని మోదీ..

- January 31, 2017 , by Maagulf
కొత్త సంప్రదాయానికి నాంది : ప్రధాని మోదీ..

''ఈరోజు ఓ కొత్త సంప్రదాయం ప్రారంభమవుతోంది. మొదటిది, దాదాపు ఒక నెల ముందుగానే బడ్జెట్ వస్తోంది. రెండోది, రైల్వే బడ్జెట్‌ దీనిలో చేరింది. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. వీటి ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆయన మాట్లాడారు. బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేదని, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఆ సంప్రదాయానికి తెరపడిందని చెప్పారు. ప్రస్తుత సమావేశాలు ప్రయోజనాత్మకంగా జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com