ఎగ్జిట్ పర్మిట్స్ ఉచితంగా..
- January 31, 2017
ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్, లీవ్ నోటిఫికేషన్ (ఎగ్జిట్ పర్మిట్) వలసదారులు, పౌరులకు ఉచితంగానే అందింనున్నామనీ, ఇవి పేపర్లెస్గా ఉంటాయని తెలిపింది. మెట్రాష్2 మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ), హుకూమి ద్వారా ఇది కండక్ట్ చేయబడుతుంది. వలసదారులు మరియు సిటిజన్స్ ట్రావెల్ ప్రొసిడ్యూర్స్ని సులభతరం చేయడానికి ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ట్రావెల్ పర్మిట్స్ సెక్షన్ హెడ్, లెఫ్టినెంట్ కల్నల్ నాజర్ జబిర్ అల్ మల్కి మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ద్వారా వలసదారులు, అలాగే మైనర్ ఖతరీలు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో లీవ్ నోటిఫికేషన్ పొందుతారనీ, ఇమ్మిగ్రేషన్కి సంబంధించి వారు ఎలాంటి ప్రింట్ అవుట్ తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. మెట్రాష్ 2, ఎంఓఐ వెబ్సైట్ లేదా హుకూమి వెబ్సైట్ ద్వారా రిక్రూటర్, వలసదారుడి డేటాని పొందుపర్చుతాడు. ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ అప్లికేషన్, ఆ తర్వాత అప్రూవ్ అవుతుంది. తద్వారా వలసదారుడు దేశం నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఖతారీలు కూడా ఇదే తరహాలో ఎగ్జిట్ పర్మిట్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









