కుప్పకూలిన భవంతి, 4మంది మృతి
- February 01, 2017
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాజ్మాలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. సుమారు వంద మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని భద్రతా సిబ్బంది రక్షించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రిలో నాణ్యతా లోపం వలనే ప్రమాదం జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ భవనం కూలడంతో సమీపంలోని రెండు ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రమాదానికి గురైన భవనం సమాజ్వాదీ పార్టీ నేతకు సంబంధించినదని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









