ఇక అందులో జీమెయిల్ పనిచేయదు.!
- February 02, 2017గూగుల్కు చెందిన జీమెయిల్ ఈ ఏడాది చివరి తర్వాత క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో పనిచేయదని ఆ సంస్థ గురువారం వెల్లడించింది. అదే విధంగా విండోస్కు పాత ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఓఎస్లు) అయిన ఎక్స్పీ, విస్తా వాడుతున్న కంప్యూటర్లలో కూడా ఇకపై జీమెయిల్ పనిచేయదని స్పష్టంచేసింది. వినియోగదారుల భద్రత రీత్యా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. గూగుల్ తాజాగా తన క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 55ను తీసుకొస్తోంది. ఇందులో పలు భద్రతా అంశాలను మెరుగుపరిచారు. కాగా, ఈ నెల 8 నుంచి క్రోమ్ వెర్షన్ 53 కంటే పాతది వాడుతున్న వారికి జీమెయిల్ ఓపెన్ చేస్తే ఇకపై అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఓ బ్యానర్ కనిపించనుంది.
మరోవైపు మైక్రోసాఫ్ట్ తన పాత ఓఎస్లు అయిన ఎక్స్పీ, విస్తా విషయంలో రెండున్నరేళ్ల క్రితమే తన సపోర్ట్ను ఉపసంహరించుకుంది. అయితే ఇప్పటికీ చాలా మంది వాటినే వాడుతున్నారు. వాటిల్లో క్రోమ్ వెర్షన్ 49 కంటే పాతవి మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత వచ్చిన వెర్షన్లు ఈ కంప్యూటర్లలో పనిచేయవు. ఇప్పటి వరకు జీమెయిల్ ఆ కంప్యూటర్లలో కూడా పనిచేస్తూ వస్తోంది. అయితే వినియోగదారుల ఖాతాల భద్రత దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. క్రోమ్ తాజా వెర్షన్లకు అప్గ్రేడ్ అవ్వాలని సూచిస్తోంది. అంటే జీమెయిల్ వినియోగించాలంటే ఇక కొత్త ఓఎస్లకు మారక తప్పని పరిస్థితి.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









