మరో అవకాశం పీఎఫ్ నమోదుకు...
- February 02, 2017
హైదరాబాద్: ఉద్యోగులు, కార్మికులు భవిష్యనిధి సభ్యులుగా ప్రయోజనాలను పొందేందుకు ఈపీఎఫ్వో 'ఉద్యోగుల నమోదు ప్రచారం- 2017' కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ ఎంఎస్కేవీవీ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2009 ఏప్రిల్ 1 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు, కార్మికులుగా చేరి వివిధ కారణాలతో భవిష్యనిధి సదుపాయాలు పొందనివారు, ఆయా యాజమాన్యాలు స్వచ్ఛం దంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోనివారు అపరాధ రుసుము కింద ఏడాదికి రూ.1 చొప్పున నామమాత్రంగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









