రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'...
- February 03, 2017
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ మోహన్ మాట్లాడుతూ.. 'ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. వారం రోజులకుపైగా ఇక్కడే తొలి షెడ్యూల్ చేయనున్నాం.
తదుపరి షెడ్యూల్ పాండిచ్చేరిలో 25 రోజులు జరుగుతుంది. మాస్ మహారాజా రవితేజ ఇమేజ్కి తగ్గట్టుగా రచయిత వక్కంతం వంశీ మంచి కథను తయారు చేశారు' అని అన్నారు. రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- Kuwait air defences intercept missiles, drones amid ongoing Iranian attack
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!







