రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'...
- February 03, 2017
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ మోహన్ మాట్లాడుతూ.. 'ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. వారం రోజులకుపైగా ఇక్కడే తొలి షెడ్యూల్ చేయనున్నాం.
తదుపరి షెడ్యూల్ పాండిచ్చేరిలో 25 రోజులు జరుగుతుంది. మాస్ మహారాజా రవితేజ ఇమేజ్కి తగ్గట్టుగా రచయిత వక్కంతం వంశీ మంచి కథను తయారు చేశారు' అని అన్నారు. రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







