రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్‌ చేసి చూడు'...

- February 03, 2017 , by Maagulf
రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్‌ చేసి చూడు'...

హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్‌ చేసి చూడు'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్‌ క్లాప్‌ ఇవ్వగా, ఎడిటర్‌ గౌతంరాజు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు వి.వి. వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్‌, వల్లభనేని వంశీ మోహన్‌ మాట్లాడుతూ.. 'ఈ రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడుతున్నాం. వారం రోజులకుపైగా ఇక్కడే తొలి షెడ్యూల్‌ చేయనున్నాం.
తదుపరి షెడ్యూల్‌ పాండిచ్చేరిలో 25 రోజులు జరుగుతుంది. మాస్‌ మహారాజా రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా రచయిత వక్కంతం వంశీ మంచి కథను తయారు చేశారు' అని అన్నారు. రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com