వరుస భూకంపాలు పాకిస్థాన్లో ...

- February 07, 2017 , by Maagulf
వరుస భూకంపాలు పాకిస్థాన్లో ...

ఇస్లామాబాద్: గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న వరుస భూకంపాలు పాకిస్థాన్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నైరుతి పాకిస్థాన్‌లోని పస్నీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భూమి తీవ్రంగా కనిపించింది.
ఈ భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్ పై 6.3గా నమోదయింది. భూ ప్రకంపనల ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
కాగా, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు వార్తలేవీ రాలేదు. గత 24 గంటల్లో ఉత్తర భారతదేశంలో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com