39,000 మంది పాకిస్తానీల డిపోర్టేషన్...
- February 08, 2017
39,000 మంది పాకిస్తానీ దేశీయుల్ని సౌదీ అరేబియా నుంచి గడచిన నాలుగు నెలల్లో డిపోర్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీసా ఉల్లంఘనల కారణంగానే ఎక్కువమందిని డిపోర్ట్ చేసినట్లుగా వారు వివరించారు. రెసిడెన్స్ అండ్ వర్క్ రూల్స్కి సంబంధించిన ఉల్లంఘనలు కూడా ఇందులో ఉన్నాయి. దయీష్ తీవ్రవాద సంస్థ తరఫున కొందరు తీవ్రవాద కార్యకలాపాల్లోనే పాలుపంచుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే పాకిస్తానీ వ్యక్తులు డ్రగ్స్ ట్రాఫికింగ్, దొంగతనాలు, ఫోర్జరీ మరియు భౌతిక దాడులు వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు అధికారులు. ఇమ్మిగ్రేషన్ విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరించి, ఇలాంటి నేరాలకు చెక్పెట్టేందుకు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. షురా కౌన్సిల్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ అబ్దుల్లా అల్ సాదౌమ్, ఈ విషయంపై మాట్లాడుతూ, పాకిస్తాన్ ముందుగానే తమ దేశం నుంచి వస్తున్నవారిపై దృష్టిపెట్టాలని అన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చినవారే ఎక్కువగా నేరాలకు పాల్పడుతుండడం దురదృష్టకరమని చెప్పారాయన. తాజాగా జెడ్డాలోని అల్ హరజాత్ మరియు అల్ నసీమ్ జిల్లాల్లో జరిగిన టెర్రరిస్ట్ ఆపరేషన్లలో 15 మంది పాకిస్తానీలు పాల్గొన్నట్లుగా గుర్తించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







