ఇండియన్ వర్కర్ మృతి: షాక్లోనే కుటుంబం
- February 08, 2017
మస్కట్: ఇండియాకి చెందిన సింధు కుమారి అనే మహిళ సలాలా ప్రాంతంలో గత శుక్రవారం విగతజీవిగా కన్పించింది. ఆమె గత నాలుగేళ్ళుగా ఒమన్లోనే పనిచేస్తోంది. తమ సోదరి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని మృతురాలి సోదరుడు శాంతకుమార్ సదాశివన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విచారణ కొనసాగుతున్నందున సింధుకుమారి మృతదేహాన్ని స్వదేశానికి తరలించలేకపోతున్నట్లు ఎంబసీ అధికారులు చెప్పారు. ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వలసదారుడు సింధుని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఆమె శరీరంపైనున్న బంగారు ఆభరణాల్ని నిందితుడు దొంగిలించాడు. రాయల్ ఒమన్ పోలీసులు, ఘటన గురించి కనుగొన్న 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అరబ్కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. బాధితురాలి ఇంట్లోకి ఆయుధంతో ప్రవేశించిన నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకోగా, దొంగిలించిన నగల్ని పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
- ట్రంప్ శాంతి మండలిలోకి పోప్ లియోను ఆహ్వానించిన ట్రంప్
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!







