ఇండియన్‌ వర్కర్‌ మృతి: షాక్‌లోనే కుటుంబం

- February 08, 2017 , by Maagulf
ఇండియన్‌ వర్కర్‌ మృతి: షాక్‌లోనే కుటుంబం

మస్కట్‌: ఇండియాకి చెందిన సింధు కుమారి అనే మహిళ సలాలా ప్రాంతంలో గత శుక్రవారం విగతజీవిగా కన్పించింది. ఆమె గత నాలుగేళ్ళుగా ఒమన్‌లోనే పనిచేస్తోంది. తమ సోదరి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని మృతురాలి సోదరుడు శాంతకుమార్‌ సదాశివన్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విచారణ కొనసాగుతున్నందున సింధుకుమారి మృతదేహాన్ని స్వదేశానికి తరలించలేకపోతున్నట్లు ఎంబసీ అధికారులు చెప్పారు. ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వలసదారుడు సింధుని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఆమె శరీరంపైనున్న బంగారు ఆభరణాల్ని నిందితుడు దొంగిలించాడు. రాయల్‌ ఒమన్‌ పోలీసులు, ఘటన గురించి కనుగొన్న 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. అరబ్‌కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. బాధితురాలి ఇంట్లోకి ఆయుధంతో ప్రవేశించిన నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకోగా, దొంగిలించిన నగల్ని పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com