పాదచారుల బ్రిడ్జ్ కోసం ఇ-రింగ్ రోడ్ మూసివేత
- February 08, 2017
పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్, తాత్కాలికంగా ఇ- రింగ్రోడ్లోని కొంత ప్రాంతంలో రెండు వైపులా ట్రాఫిక్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ స్ట్రీట్ మరియు అల్ తుమామా ఇంటర్సెక్షన్ వద్ద ఈ క్లోజర్ని అమలు చేస్తున్నారు. పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఈ తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అష్గల్ అధికారులు చెప్పారు. ఇ-రింగ్ రోడ్పై మూసివేత అమల్లో ఉన్నందున, ఎయిర్పోర్ట్ స్ట్రీట్ నుంచి అల్ తుమామా ఇంటర్సెక్షన్కి వెళ్ళేవారు ఒక్బా బిన్ నఫిస్ స్ట్రీట్ని అలాగే ఆల్టర్నేటివ్ లోకల్ రోడ్స్ని వినియోగించుకోవచ్చు. అల్ తుమామా ఇంటర్సెక్షన్ నుంచి ఎయిర్పోర్ట్ స్ట్రీట్ వైపు వెళ్ళేవారు నజ్మా స్ట్రీట్ని అల్ హదారా స్ట్రీట్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ మళ్ళింపులకు సంబంధించి మ్యాప్ని కూడా విడుదల చేశారు వాహనదారులకోసం. ఇ-రింగ్ రోడ్డుపైనుంచి పాదచారులు నడిచి వెళ్ళడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందున, వాటిని నివారించేందుకు ఈ బ్రిడ్జ్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







