ఇండియన్ వర్కర్ మృతి: షాక్లోనే కుటుంబం
- February 08, 2017
మస్కట్: ఇండియాకి చెందిన సింధు కుమారి అనే మహిళ సలాలా ప్రాంతంలో గత శుక్రవారం విగతజీవిగా కన్పించింది. ఆమె గత నాలుగేళ్ళుగా ఒమన్లోనే పనిచేస్తోంది. తమ సోదరి మరణం తమను తీవ్రంగా కలచివేసిందని మృతురాలి సోదరుడు శాంతకుమార్ సదాశివన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విచారణ కొనసాగుతున్నందున సింధుకుమారి మృతదేహాన్ని స్వదేశానికి తరలించలేకపోతున్నట్లు ఎంబసీ అధికారులు చెప్పారు. ఒమన్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వలసదారుడు సింధుని అతి కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఆమె శరీరంపైనున్న బంగారు ఆభరణాల్ని నిందితుడు దొంగిలించాడు. రాయల్ ఒమన్ పోలీసులు, ఘటన గురించి కనుగొన్న 24 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అరబ్కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. బాధితురాలి ఇంట్లోకి ఆయుధంతో ప్రవేశించిన నిందితుడు ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకోగా, దొంగిలించిన నగల్ని పోలీసులు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







