సానియా మీర్జాకు సమన్లు జారీ చేసిన సేవా పన్ను అధికారులు
- February 08, 2017
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు సేవా పన్ను అధికారులు సమన్లు జారీ చేశారు. సేవా పన్నులు చెల్లింపులు సక్రమంగా లేనందున విచారణ నిమిత్తం ఈ నెల 16న స్వయంగా సానియా మీర్జాకాని, ఆమె ప్రతినిధి కాని తమ ఎదుట హాజరు కావాలని సేవా పన్ను అధికారి సురేష్కుమార్ ఆదేశించారు. రెడ్హిల్స్లోని సేవా పన్ను విభాగం అధికారులు ఈ నెల 6వ తేదీన ఆమెకు సమన్లు జారీ చేశారు. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న సానియా మీర్జాకు వీటిని అందచేశారు. 1994 ఆర్థిక చట్టం ప్రకారం తాము జారీ చేసిన సమన్లకు స్పందించి తగిన పత్రాలు ఇవ్వనట్లయితే చట్ట ప్రకారం తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







