షిర్డీ సాయిబాబాకు రూ.28లక్షల బంగారు కిరీటం బహుకరించిన ఇటలీ మహిళ..
- February 10, 2017
షిర్డీ సాయిబాబాకు ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల బంగారు కిరీటాన్ని బహుకరించారు. శీలిని డోలోరాస్ అలియాస్ సాయి దుర్గా అనే 72 ఏళ్ల ఇటాలియన్ మహిళా భక్తురాలు 855 గ్రాముల బరువు ఉన్న రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు బహుకరించారు. సాయిబాబా భక్తురాలైన ఇటలీ మహిళ గత 9 ఏళ్లుగా ప్రతీనెలా షిర్డీని సందర్శిస్తుంటారు. గతంలో ఈమె బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాలను రూ.25లక్షలతో చేయించి ఇచ్చారు. తమ ఇటలీ దేశంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు శీలిని డోలోరాస్ వెల్లడించారు. తమ దేశంలో నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసిన సాయి ప్రతిమను షిర్డీ సాయి సన్నిధిలో పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఇటలీలోని సాయి భక్తురాలు వివరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







