దుబాయ్ కాలువ ద్వారా ఇప్పుడు ఒక సాంప్రదాయ అబ్రా ప్రయాణం
- February 12, 2017
దుబాయ్: సాంప్రదాయ అబ్రాస్ ప్రయాణానికి ఇప్పుడు దుబాయ్ కాలువలో అందుబాటులో ఉన్నాయని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) శనివారం ప్రకటించింది.ప్రధానంగా 20 సీట్లు గల అబ్రాస్ పర్యాటకులకు అనువుగా ఉంటాయని, ఇందులో ప్రయాణించడానికి ఒక్కొక్కరకి 25 డి హెచ్ టిక్కెట్ల కోసం వసూలు చేస్తారు. స్టేషన్ నుండి షేక్ జాయెద్ రోడ్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. అబ్రాస్ గంటకు 300 డి హెచ్ అద్దెతో అందుబాటులో ఉంటుంది. ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యొక్క సి ఈ ఓ అబ్దుల్లా యూసుఫ్ అల్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ కాలువలో సంప్రదాయ అబ్రాస్ నిర్వహణ ముఖ్యంగా పర్యాటకుల లక్ష్యంగా ఏర్పాటుచేయబడిందని అలాగే సముద్ర రవాణా సేవలు విస్తరించే ప్రణాళికలలో ఇదో భాగం అని ఆయన తెలిపారు. సంప్రదాయ అబ్రాలో ప్రయాణించడానికి 20 మందికి అవకాశం కల్పించే సామర్థ్యం ఉంది కోరినప్పుడు అందుబాటులోఉంటుంది, ఒక పర్యటనలో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు ఉంటె షేక్ జాయెద్ రోడ్ స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ప్రయాణం బాగుంటుందని యూసుఫ్ అల్ ఆలీ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!







