రాజేంద్రప్రసాద్ భార్యపై కేసు పెట్టిన సినీ డిస్ట్రిబ్యూటర్...
- February 13, 2017
హైదరాబాద్: ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భార్య విజయ ఛాముండేశ్వరి కోర్టు చిక్కుల్లో ఇరుకున్నారు. ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ జయభరత్ రెడ్డి విజయ ఛాముండేశ్వరిపై కేసు పెట్టారు.
రూ. 25 లక్షల అప్పుకు సంబంధించి ఏర్పడిన వివాదమే ఈ కేసు పెట్టడానికి కారణం అయింది. ఈ కేసుకు సంబంధించి అందింన వివరాల ప్రకారం విజయ ఛాముండేశ్వరి జయభరత్ రెడ్డి వద్ద 2013లో రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగి ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆమె మాట తప్పినట్లు తెలుస్తోంది.
అప్పు తిరిగి ఇవ్వడంలో భాగంగా చివరకు 2016 జూన్లో 10లక్షలు, 15లక్షలు విలువ చేసే రెండు చెక్లు ఇచ్చారు.
అవి ఆస్టులో మెచ్యూర్ అవుతాయని చెప్పారు. అయితే ఆ చెక్కులు బౌన్స్ కావడంతో జయభరత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఫిబ్రవరి 21న విచారించనున్నారు.
ఇక నటుడు రాజేంద్రప్రసాద్ కెరీర్లో అందరికీ గుర్తుండిపోయే సినిమా 'అప్పుల అప్పారావు'. అందులో అందరి వద్ద అప్పులు చేసి ఎగ్గొట్టే అప్పరావుగా ఆయన అందరినీ నవ్వించింది. అయితే రియల్ లైఫ్ లో రాజేంద్రప్రసాద్ అప్పుకు తీసుకుని కోర్టు చిక్కల్లో ఇరుక్కోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







