శశికళ శపథం!...
- February 15, 2017
చెన్నై: న్యాయస్థానం వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన తర్వాత శశికళ జయ సమాధి మీద గట్టిగా మూడు సార్లు చేత్తో చరిచి మరీ ఏదో శపథం చేశారు. వూహించని ఈ పరిణామానికి అందరూ బిత్తరపోయారు. సమాధి మధ్య భాగంలో తగిలేలా వంగి మరీ అరచేత్తో గట్టిగా చరిచారు శశికళ. ఒకసారి కొట్టడం.. ముకుళిత హస్తాలతో ఏదో ఉచ్చరించడం, మళ్లీ కొట్టడం, మళ్లీ ఉచ్చరించడం.. అలా మూడుసార్లు చేశారు. అనంతరం తిరిగి కారెక్కి బెంగళూరువైపు రోడ్డు మార్గంలో బయల్దేరారు.
జయ సమాధి సాక్షిగా శశికళ ఏదో శపథం చేశారని ఆ దృశ్యం చూసినవారికి అర్థమవుతోంది.
దాంతో శశి ఏమని శపథం చేసివుంటారన్న విషయం నిమిషాల్లోనే చర్చనీయాంశమైపోయింది. అనారోగ్యం కారణం చూపుతూ లొంగిపోయేందుకు నాలుగు వారాలు గడువుకోరిన శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వెంటనే బెంగళూరు బయల్దేరారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







