శశికళ శపథం!...
- February 15, 2017
చెన్నై: న్యాయస్థానం వద్ద లొంగిపోవడానికి చెన్నై నుంచి బెంగళూరు బయల్దేరిన శశికళ మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద నివాళులర్పిస్తూ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పుష్పాలతో నివాళులర్పించిన తర్వాత శశికళ జయ సమాధి మీద గట్టిగా మూడు సార్లు చేత్తో చరిచి మరీ ఏదో శపథం చేశారు. వూహించని ఈ పరిణామానికి అందరూ బిత్తరపోయారు. సమాధి మధ్య భాగంలో తగిలేలా వంగి మరీ అరచేత్తో గట్టిగా చరిచారు శశికళ. ఒకసారి కొట్టడం.. ముకుళిత హస్తాలతో ఏదో ఉచ్చరించడం, మళ్లీ కొట్టడం, మళ్లీ ఉచ్చరించడం.. అలా మూడుసార్లు చేశారు. అనంతరం తిరిగి కారెక్కి బెంగళూరువైపు రోడ్డు మార్గంలో బయల్దేరారు.
జయ సమాధి సాక్షిగా శశికళ ఏదో శపథం చేశారని ఆ దృశ్యం చూసినవారికి అర్థమవుతోంది.
దాంతో శశి ఏమని శపథం చేసివుంటారన్న విషయం నిమిషాల్లోనే చర్చనీయాంశమైపోయింది. అనారోగ్యం కారణం చూపుతూ లొంగిపోయేందుకు నాలుగు వారాలు గడువుకోరిన శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. దాంతో ఆమె వెంటనే బెంగళూరు బయల్దేరారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







