కశ్మీర్‌లో అమరవీరులకు మోదీ నివాళులు

- February 15, 2017 , by Maagulf
కశ్మీర్‌లో అమరవీరులకు మోదీ నివాళులు

కశ్మీర్‌లో మంగళవారం జరిగిన రెండు వేరు వేరు ఎన్‌కౌంటర్లలో వీరమరణం పొందిన ముగ్గురు సైనికులు, ఒక మేజర్‌కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. దిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న వారి మృతదేహాల వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రధానమంత్రికి సంఘటన జరిగిన తీరును గురించి వివరించారు. జమ్మూకశ్మీర్‌లోని బందిపుర జిల్లా హజీన్‌ ప్రాంతంలో, క్రాల్‌గంద్‌ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com