చాలా కాలం తర్వాత వెండి తెరపై భర్తతో నటించనున్న నమ్రత

- February 15, 2017 , by Maagulf
చాలా కాలం తర్వాత వెండి తెరపై భర్తతో నటించనున్న నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి విధితమే.. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తి కారణమైన వార్తా బయటకు వస్తోంది.. ఇప్పటికే మహేష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్.. కాగా ఇప్పటికే మహేష్ బాబుతో రకుల్ ప్రీతి సింగ్ రొమాన్స్ చేస్తున్న సంగతి విధితమే.. కదా సెకండ్ హీరోయిన్ గా మహేష్ బాబు భార్య నమ్రత నటిస్తోంది అని టాక్ వినిపిస్తోంది. కాగా మహేష్ బాబు నమ్రత లు పదేళ్ళ క్రితం వంశీ సినిమాలో నటించారు.. ఈ సినిమాలో వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకొన్నారు.. అనంతరం నమ్రత ఇంటికే పరితమయ్యారు.. కానీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పిన నేపద్యంలో మహేష్ తో నటిస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. పదేళ్ళ తర్వాత మహేష్, నమ్రత లను వెండి తెరపై జోడీగా చూసే అవకాశం లభిస్తుంది అని ప్రిన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com