చాలా కాలం తర్వాత వెండి తెరపై భర్తతో నటించనున్న నమ్రత
- February 15, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి విధితమే.. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తి కారణమైన వార్తా బయటకు వస్తోంది.. ఇప్పటికే మహేష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాల టాక్.. కాగా ఇప్పటికే మహేష్ బాబుతో రకుల్ ప్రీతి సింగ్ రొమాన్స్ చేస్తున్న సంగతి విధితమే.. కదా సెకండ్ హీరోయిన్ గా మహేష్ బాబు భార్య నమ్రత నటిస్తోంది అని టాక్ వినిపిస్తోంది. కాగా మహేష్ బాబు నమ్రత లు పదేళ్ళ క్రితం వంశీ సినిమాలో నటించారు.. ఈ సినిమాలో వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకొన్నారు.. అనంతరం నమ్రత ఇంటికే పరితమయ్యారు.. కానీ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పిన నేపద్యంలో మహేష్ తో నటిస్తోంది అనే టాక్ వినిపిస్తోంది. పదేళ్ళ తర్వాత మహేష్, నమ్రత లను వెండి తెరపై జోడీగా చూసే అవకాశం లభిస్తుంది అని ప్రిన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







