అల్ ఖాఫ్జి లోని స్వదేశీయులను సందర్శించిన భారత రాయబారి
- February 16, 2017
రియాద్ : కీలకమైన అనేక విషయాలను చర్చించే నిమిత్తం భారత రాయబారి అహ్మద్ జావెద్ మంగళవారం అల్ ఖాఫ్ కమ్యూనిటీ సభ్యులను కలిశారు. అంతేకాకుండా ఆయన అంతర్జాతీయ భారతీయ పాఠశాలని పర్యటించి భారతీయ ప్రభుత్వం యొక్క కొత్త కార్యక్రమాలు మరియు అభివృద్ధి చర్యల పట్ల సిబ్బంది వివరించడంతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులతో ఒక చర్చా గోష్ఠి నిర్వహించారు. మొదటి కార్యదర్శి (కమ్యూనిటీ సంక్షేమం) అనిల్ నౌటియాల్ రాయబారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం భారతీయ దౌత్యవేత్త జావేద్ ఆ ప్రాంతంలో జరిపిన మొట్టమొదట పర్యటన గురించి బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. భారతీయ సమాజం సభ్యులతో జరిగిన ఒక సమావేశంలో, భారతీయ దౌత్యవేత్త జావేద్ కింగ్డమ్ తో భారతదేశం యొక్క సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారని ఆయన తెలిపారు.సౌదీ అరేబియాలో భారత ఉద్యోగులైన మీరు శ్రద్ధ, కృషి మరియు విధేయతతో మెలగాలని భారతేదేశ పౌరులంటే మిగతావారికి గౌరవ మర్యాదాలు పొందేలా ప్రవర్తించాలని ఆయన అన్నారు. అలాగే ఎల్లప్పుడూ స్థానిక చట్టాలను గౌరవించాలని కమ్యూనిటీ సభ్యులను ఆయన ఈ సందర్భంగా భారత రాయబారి అహ్మద్ జావెద్ కోరారు.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









