అల్ ఖాఫ్జి లోని స్వదేశీయులను సందర్శించిన భారత రాయబారి
- February 16, 2017
రియాద్ : కీలకమైన అనేక విషయాలను చర్చించే నిమిత్తం భారత రాయబారి అహ్మద్ జావెద్ మంగళవారం అల్ ఖాఫ్ కమ్యూనిటీ సభ్యులను కలిశారు. అంతేకాకుండా ఆయన అంతర్జాతీయ భారతీయ పాఠశాలని పర్యటించి భారతీయ ప్రభుత్వం యొక్క కొత్త కార్యక్రమాలు మరియు అభివృద్ధి చర్యల పట్ల సిబ్బంది వివరించడంతో పాటు అక్కడ ఉన్న విద్యార్థులతో ఒక చర్చా గోష్ఠి నిర్వహించారు. మొదటి కార్యదర్శి (కమ్యూనిటీ సంక్షేమం) అనిల్ నౌటియాల్ రాయబారితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం భారతీయ దౌత్యవేత్త జావేద్ ఆ ప్రాంతంలో జరిపిన మొట్టమొదట పర్యటన గురించి బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. భారతీయ సమాజం సభ్యులతో జరిగిన ఒక సమావేశంలో, భారతీయ దౌత్యవేత్త జావేద్ కింగ్డమ్ తో భారతదేశం యొక్క సుహృద్భావ మరియు స్నేహపూర్వక సంబంధాలను గుర్తుచేసుకున్నారని ఆయన తెలిపారు.సౌదీ అరేబియాలో భారత ఉద్యోగులైన మీరు శ్రద్ధ, కృషి మరియు విధేయతతో మెలగాలని భారతేదేశ పౌరులంటే మిగతావారికి గౌరవ మర్యాదాలు పొందేలా ప్రవర్తించాలని ఆయన అన్నారు. అలాగే ఎల్లప్పుడూ స్థానిక చట్టాలను గౌరవించాలని కమ్యూనిటీ సభ్యులను ఆయన ఈ సందర్భంగా భారత రాయబారి అహ్మద్ జావెద్ కోరారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







