ఉగ్రవాదాన్ని అంతం చేయండి: ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన నవాజ్

- February 17, 2017 , by Maagulf
ఉగ్రవాదాన్ని అంతం చేయండి: ఆర్మీకి ఆదేశాలు ఇచ్చిన నవాజ్

తన వరకు వస్తే గాని ఆ బాధేంటో తెలియదనే సామెతుంది. పాకిస్థాన్‌కు ఇది సరిగ్గా వర్తిస్తుంది. ఉగ్ర దాడులపై భారత్ ఎంత గగ్గోలు పెట్టినా పాక్ పట్టించుకోలేదు. అయితే గత కొంతకాలంగా పాకిస్థాన్ ఆ ముష్కర దాడులకు బలవుతోంది. తాజాగా గురువారం సింధ్ రాష్ట్రంలోని సుఫీ మసీదుపై ఉగ్ర దాడి జరిగింది. 88 మంది ముస్లింలు మృతి చెందగా సుమారు 350 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

ఈ ఘటనతో పాకిస్థాన్ ప్రభుత్వం మేల్కొంది. ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం ఆ దేశ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బజ్వాతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. గాయపడిన బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం భద్రతా దళాధిపతులతో నవాజ్ సమావేశమయ్యారు. పూర్తి బలాన్ని వినియోగించి ఉగ్రవాదులను ఏరివేయాలని పాక్ ఆర్మీని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com