ఇండియాలో ఉన్న ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది
- February 18, 2017
పనాజీ: భారత్లో ఉన్న ఏకైక అగ్నిపర్వతం బద్దలైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ఐలాండ్ వాల్కెనో విస్పోటనం చెందటంతో అందులోంచి లావా ఎగజిమ్ముతోంది.
1991లో చివరిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలవగా.. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ విస్పోటనం చెందినట్లుగా గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) తెలిపింది.
ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగజిమ్మడంతో పాటు దట్టమైన పొగలు వెలువడుతున్నట్లుగా ఎన్ఐఓ పేర్కొంది. గత నెల 23న బారెన్ అగ్నిపర్వతాన్ని పరిశీలించడానికి కొంతమంది శాస్త్రవేత్తల బృందం వెళ్లగా.. ఆ సమయంలో దాని నుంచి పొగలు వెలువడటం వారు గమనించారు.
పగటిపూట కేవలం పొగలు మాత్రమే వెలువడుతున్నట్లుగా గుర్తించిన శాస్త్రవేత్తలు, రాత్రి సమయంలో దాని నుంచి లావా బయటకొస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









