ఇండియాలో ఉన్న ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది
- February 18, 2017
పనాజీ: భారత్లో ఉన్న ఏకైక అగ్నిపర్వతం బద్దలైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ఐలాండ్ వాల్కెనో విస్పోటనం చెందటంతో అందులోంచి లావా ఎగజిమ్ముతోంది.
1991లో చివరిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలవగా.. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ విస్పోటనం చెందినట్లుగా గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) తెలిపింది.
ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగజిమ్మడంతో పాటు దట్టమైన పొగలు వెలువడుతున్నట్లుగా ఎన్ఐఓ పేర్కొంది. గత నెల 23న బారెన్ అగ్నిపర్వతాన్ని పరిశీలించడానికి కొంతమంది శాస్త్రవేత్తల బృందం వెళ్లగా.. ఆ సమయంలో దాని నుంచి పొగలు వెలువడటం వారు గమనించారు.
పగటిపూట కేవలం పొగలు మాత్రమే వెలువడుతున్నట్లుగా గుర్తించిన శాస్త్రవేత్తలు, రాత్రి సమయంలో దాని నుంచి లావా బయటకొస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







