‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’

- February 18, 2017 , by Maagulf
‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కీలకపాత్రలో నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాం బాబా జీవితగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రసార, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’ అంటూ కితాబిచ్చారు. ఆయనతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున తదితరులు ఉన్నారు.
ఏఎంఆర్‌ సాయి కృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఎం.మహేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com