‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’
- February 18, 2017
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కీలకపాత్రలో నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాం బాబా జీవితగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ప్రసార, సమాచారశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రసాద్ ల్యాబ్స్లో చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతీ భారతీయుడు చూడాల్సిన చిత్రం’ అంటూ కితాబిచ్చారు. ఆయనతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున తదితరులు ఉన్నారు.
ఏఎంఆర్ సాయి కృపా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.మహేష్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







