బంగారం కొంటే పన్ను
- February 19, 2017
నగదుతో రూ.2 లక్షలకుపైగా కొంటే 1% టీసీఎస్
సాధారణ వస్తువుల జాబితాలోకి బంగారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడానికి కేంద్రం మరో అడుగు వేసింది. రెండు లక్షల రూపాయలకు మించి బంగారాన్ని నగదు రూపంలో కొంటే అక్కడికక్కడే 1 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్)ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. వాస్తవానికి, ఇప్పటి వరకూ నగదుతో బంగారం కొనడానికి రూ.5 లక్షల వరకూ పరిమితి ఉంది. ఆపైన కొన్న బంగారానికే టీసీఎస్ చెల్లించాల్సి ఉంది. కానీ, ఇటీవలి బడ్జెట్లో కేంద్రం బంగారాన్ని కూడా 'సాధారణ వస్తువుల' జాబితాలోకి చేర్చింది.
దాంతో, రూ.2 లక్షలపైన నగదు రూపంలో కొనుగోలు చేస్తే 1 శాతం టీసీఎస్ చెల్లించక తప్పదు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తర్వాత, ఏప్రిల్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. నల్ల ధనాన్ని నిరోధించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్కు మరిన్ని కోరలు: అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) నుంచి పొందే అధికారాలను రక్షణ శాఖలో కీలకమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ)కు ఇచ్చారు.
దాంతో, జమ్ము కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలకు తరలి వచ్చే ఉగ్రవాద నిధులు, హవాలా లావాదేవీలపై చర్యలు తీసుకోవడానికి దీనికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







