బంగారం కొంటే పన్ను
- February 19, 2017
నగదుతో రూ.2 లక్షలకుపైగా కొంటే 1% టీసీఎస్
సాధారణ వస్తువుల జాబితాలోకి బంగారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడానికి కేంద్రం మరో అడుగు వేసింది. రెండు లక్షల రూపాయలకు మించి బంగారాన్ని నగదు రూపంలో కొంటే అక్కడికక్కడే 1 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్)ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. వాస్తవానికి, ఇప్పటి వరకూ నగదుతో బంగారం కొనడానికి రూ.5 లక్షల వరకూ పరిమితి ఉంది. ఆపైన కొన్న బంగారానికే టీసీఎస్ చెల్లించాల్సి ఉంది. కానీ, ఇటీవలి బడ్జెట్లో కేంద్రం బంగారాన్ని కూడా 'సాధారణ వస్తువుల' జాబితాలోకి చేర్చింది.
దాంతో, రూ.2 లక్షలపైన నగదు రూపంలో కొనుగోలు చేస్తే 1 శాతం టీసీఎస్ చెల్లించక తప్పదు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తర్వాత, ఏప్రిల్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. నల్ల ధనాన్ని నిరోధించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్కు మరిన్ని కోరలు: అంతర్జాతీయ ఆర్థిక, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) నుంచి పొందే అధికారాలను రక్షణ శాఖలో కీలకమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ)కు ఇచ్చారు.
దాంతో, జమ్ము కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలకు తరలి వచ్చే ఉగ్రవాద నిధులు, హవాలా లావాదేవీలపై చర్యలు తీసుకోవడానికి దీనికి అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









