వలసదారులకు ఎలక్ట్రిసిటీ టారిఫ్ 'డబుల్'
- February 20, 2017
బహ్రెయిన్లో వలసదారులకు ఇకపై ఎలక్ట్రిసిటీ టారిఫ్ డబుల్ కానుంది. మార్చ్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రిసిటీతోపాటు, వాటర్ బిల్లులు కూడా 'డబుల్' మొత్తంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నాయి. 0 నుంచి 3000 యూనిట్స్ వరకు ప్రస్తుతం 6 ఫిల్స్గా ఉన్న బిల్లు ఇకపై 13 ఫిల్స్కి (ఒక్కో యూనిట్) చేరుకుంటుంది. అదే వాటర్ విషయానికొస్తే 0 నుంచి 60 యూనిట్ల వరకు 80 ఫిల్స్ నుంచి 200 ఫిల్స్కి (ఒక్కో యూనిట్) చేరుకుంటుంది. గత ఏడాది మార్చ్ నుంచి వాటర్ మరియు ఎలక్ట్రిసిటీ బిల్స్లో సంస్కరణలు తీసుకొచ్చారు. సబ్సిడీలు ఎత్తివేయడం, అలాగే ధరల్ని పెంచడం ద్వారా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.

తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







